భవనం నుంచి కిందపడి.. షార్జాలో కేరళ వాసి మృతి!
ABN , First Publish Date - 2020-08-03T17:42:45+05:30 IST
షార్జాలో భవనంపై నుంచి కిందపడి.. ఓ భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎలక్ట్రి
అబుధాబి: షార్జాలో భవనంపై నుంచి కిందపడి.. ఓ భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సుమేష్ (24).. పని కోసం గత ఏడాది షార్జాకు వెళ్లాడు. అక్కడ డిజైనర్గా పని చేస్తూ.. కొంత మందితో కలిసి, అల్ ధైద్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జూలై 31న ఫోన్ మాట్లాడేందుకు గది నుంచి బయటికి వెళ్లిన సుమేష్.. భవనం ఆరో అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. గత కొద్ది రోజులుగా సుమేష్.. వ్యక్తిగత సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమేష్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడా లేదా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.