కరోనా రిపోర్ట్: కర్ణాటకలో తాజాగా 248 కోవిడ్-19 కేసులు

ABN , First Publish Date - 2020-05-30T01:27:39+05:30 IST

కర్ణాటకలో కొత్తగా 248 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...

కరోనా రిపోర్ట్: కర్ణాటకలో తాజాగా 248 కోవిడ్-19 కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 248 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు మరణించారు. 60 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,781కి చేరింది. 48 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 894 మంది డిశ్చార్జ్ కాగా 1,837 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-30T01:27:39+05:30 IST