ఏపీలో కొత్తగా 244 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-02-22T23:45:57+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో 23,16,711కి కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా 14,716 మరణాలు సంభవించాయి. ఏపీలో 5,565 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మొత్తం 22,96,430 మంది రికవరీ చెందారు.