242 కేజీల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-19T05:33:38+05:30 IST

జాతీయ రహదారిపై వాహన తనిఖీల్లో 242 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌ తెలిపారు.

242 కేజీల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితులు

దేవరపల్లి, జనవరి 18: జాతీయ రహదారిపై వాహన తనిఖీల్లో 242 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌ తెలిపారు. దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఈ నెల 17న సాయంత్రం జాతీయ రహదారిపై ఎస్‌ఐ శ్రీహరిరావు, సిబ్బంది తనిఖీ చేస్తుండగా విశాఖ జిల్లా తాడేరు నుంచి బీహార్‌ రాష్ట్రం గయకు 242 కేజీల గంజాయి రవాణా చేస్తున్న కంటైనర్‌ వాహనాన్ని గుర్తించారన్నారు. బిహార్‌కు చెంది న బసంత్‌ యాద్‌, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గులామ్‌ జిలాని, అహ్మద్‌ నిజాముద్దీన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి రవాణా అడ్డుకున్న ఎస్‌ఐ శ్రీహరిరావు, 10 మంది పోలీస్‌ సిబ్బందికి రివార్డు కోసం సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమా వేశంలో కొవ్వూరు రూరల్‌ సీఐ వైవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:33:38+05:30 IST