ఇథియోపియా అల్లర్లలో 239 మంది మృతి
ABN , First Publish Date - 2020-07-09T07:45:08+05:30 IST
ఇథియోపియాలో చెలరేగిన హింసలో గత వారం రోజుల్లో సుమారు 239 మంది మరణించారు. దీంతో 3,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ప్రధానమంత్రి అబీ అహ్మద్కు...
అడ్డిస్ అబాబా, జూలై 8: ఇథియోపియాలో చెలరేగిన హింసలో గత వారం రోజుల్లో సుమారు 239 మంది మరణించారు. దీంతో 3,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ప్రధానమంత్రి అబీ అహ్మద్కు ఇదో పెద్ద సవాలుగా మారింది. ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం ఇథియోపియా. జూన్ 29న ప్రముఖ గాయకుడు, ఉద్యమకారుడు హచలు హుండెస్సా హత్యకు గురైన అనంతరం తాజా అల్లర్లు చెలరేగాయి.