ప్రైవేటు రైళ్లు నడిపేందుకు 23 సంస్థల ఆసక్తి..!

ABN , First Publish Date - 2020-08-13T05:08:47+05:30 IST

భారత్‌లో ప్రవేటు రైళ్లు నడిపేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిలో అంతర్జాతీయ సంస్థల కూడా ఉండటం విశేషం.

ప్రైవేటు రైళ్లు నడిపేందుకు 23 సంస్థల ఆసక్తి..!

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రవేటు రైళ్లు నడిపేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిలో అంతర్జాతీయ సంస్థల కూడా ఉండటం విశేషం. ఈ విషయమై ప్రభుత్వాదికారులతో జరిగిన సమావేశంలో దాదాపు 23 సంస్థలు పాలుపంచుకున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన ఆల్‌స్టోమ్, బొంబార్డియే, సీమెన్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశంలోని 109 రూట్లలో ప్రైవేటు రైళ్లకు అనుమతిస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 151 ప్రైవేటు రైళ్లను దాదాపు 35 ఏళ్ల పాటు నిర్వహించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా తెలిపింది. ఈ క్రమంలో వివిధ ప్రైవేటు సంస్థలు లాంఛనంగా దారఖాస్తు చేసే ముందు.. కొన్ని అంశాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. 

Updated Date - 2020-08-13T05:08:47+05:30 IST