23 కొవిడ్ పాజిటివ్లు
ABN , First Publish Date - 2021-10-28T07:04:12+05:30 IST
జిల్లాలో బుధవారం 23 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి.
ఒంగోలులోనే తొమ్మిది కేసులు
ఒంగోలు (కలెక్టరేట్), అక్టోబరు 27 : జిల్లాలో బుధవారం 23 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. అందులో ఒంగోలు నగరరంలో తొమ్మిది ఉన్నాయి. రూరల్లో నాలుగు, చీరాల రూరల్లో మూడు వెలుగు చూశాయి. చినగంజాం, కనిగిరి, కొనకనమిట్ల, కొత్తపట్నం, పామూరు, పర్చూరు, టంగుటూరుల్లో ఒక్కో కేసు నమోదైంది.
32,639మందికి టీకాలు
ఒంగోలు (కలెక్టరేట్), అక్టోబరు 27 : జిల్లాలో బుధవారం 134 కేంద్రాలలో 32,639 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.రత్నావళి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 36,96,973 మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.