మచిలీపట్నం డివిజన్లో 23 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-17T06:03:50+05:30 IST
మచిలీపట్నం డివిజన్లో గురువారం 23కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్గీవో ఖాజావలి తెలిపారు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : మచిలీపట్నం డివిజన్లో గురువారం 23కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్గీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నంలోని మాచవరం, కాలేఖాన్పేట, పరాసుపేట, బందరుకోట, మల్కాపట్నం, లక్ష్మణరావుపరం లలో ఒక్కోకేసు, రాజుపేట, జలాల్పేటలలో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయన్నారు. అవనిగడ్డలో రెండు, బందలాయి చెరువు, కూచిపూడి, కాజ, గుల్లలమోద, గూడూరులో ఒక్కో కేసు చొప్పున, అవనిగడ్డలో రెండు, రామానగరంలో రెండు, పర్రచివర నాలుగు కేసులు నమోదైనట్టు ఆర్డీవో తెలిపారు.