పిడుగులు పడి 22 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2020-07-03T01:32:42+05:30 IST

బీహార్‌లోని పలు ప్రాంతాల్లో గురువారంనాడు పిడుగులు పడి 22 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా విభాగం..

పిడుగులు పడి 22 మంది దుర్మరణం

పాట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో గురువారంనాడు పిడుగులు పడి 22 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా విభాగం ప్రకటించింది. పాట్నా, ఈస్ట్ చంపరాన్, సమస్టి‌పూర్, షివోహర్, కతిహార్, మాధేపుర, పూర్ణియాల్లో ఈ పిడుగుపాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, మృతులకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. గత వారం బీహార్‌లో ఉరుములతో కూడిన గాలివాన, పిడుగులు పడి 92 మంది మృతి చెందారు.

Updated Date - 2020-07-03T01:32:42+05:30 IST