22 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-11-29T06:20:08+05:30 IST
జిల్లాలో గత 24 గంటల్లో 5,536 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 22 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 28: జిల్లాలో గత 24 గంటల్లో 5,536 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 22 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 60,280కు చేరింది. ఇందులో 196 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఘాట్ల వద్ద ఇద్దరికి
కర్నూలు పంప్హౌస్ పుష్కర ఘాట్లో ఓ ఏఎస్ఐకి, మంత్రాలయం మఠం ఘాట్-2లో ఓ భక్తుడికి కరోనా వైరస్ సోకింది. జిల్లాలోని 23 ఘాట్లలో సిబ్బంది, పోలీసులు, భక్తులకు పరీక్షలు నిర్వహించగా.. 17 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిలో ఇద్దరు భక్తులు, మిగిలిన వారు పోలీసులు.