21న Congress చలో రాజ్భవన్
ABN , First Publish Date - 2022-07-19T16:36:25+05:30 IST
నేషనల్ హెరాల్డ్ ప్రకరణ పేరిట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నోటీసులు జారీ చేయడంపై
- సోనియాగాంధీకి ఈడీ నోటీసులపై నిరసన
బెంగళూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ ప్రకరణ పేరిట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర నిరసనకు సిద్ధమైంది. ఈ నెల 21న చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని వేధించాలనే కేంద్రప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ 21న పెద్దఎత్తున కార్యకర్తలు ఫ్రీడంపార్కుకు చేరుకుంటారని, అక్కడి నుంచి రాజ్భవన్ను ముట్టడించేందుకు ర్యాలీ చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీ్పసింగ్ సుర్జేవాలా 600 మంది పార్టీ పదాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు.