తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-17T15:35:08+05:30 IST

తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. డతాజాగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో పాజిటివ్‌ కేసులు 1,65,003కి చేరింది.  గత 24 గంటలుగా రాష్ట్రంలో 9 మంది మాత్రమే కరోనాతో చనిపోయారని మీడియా బులెటిన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,005 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో 30,443 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,33,555 కరోనాను జయించారు. జీహెచ్‌ఎంసీలో 318, రంగారెడ్డిలో 176, నల్గొండలో 141, సిద్దిపేటలో 132, కరీంనగర్‌లో 127, మేడ్చల్‌లో 121 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-17T15:35:08+05:30 IST