21 ఏళ్లకే మేయర్ పదవి!
ABN , First Publish Date - 2020-12-26T08:57:48+05:30 IST
దేశంలోనే పిన్నవయసులో మేయర్ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించేందుకు ఆర్యన్ రాజేంద్రన్ సిద్ధమవుతున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గం ఈమేరకు ఆమెను కేరళ రాష్ట్రం తిరువనంతపురం మేయర్ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించింది...
- తిరువనంతపురం ప్రథమపౌరురాలిగా ఎన్నిక
తిరువనంతపురం, డిసెంబరు 25 : దేశంలోనే పిన్నవయసులో మేయర్ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించేందుకు ఆర్యన్ రాజేంద్రన్ సిద్ధమవుతున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గం ఈమేరకు ఆమెను కేరళ రాష్ట్రం తిరువనంతపురం మేయర్ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీంతో 21 ఏళ్ల ఆర్య ఎంపిక లాంఛనం కానుంది. డిగ్రీ పూర్తిచేసిన ఆర్య మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎస్ఎ్ఫఐ రాష్ట్ర క మిటీ సభ్యురాలిగా ఉన్నారు. సీపీఎం అనుబంధసంస ్థ...బాలసంఘానికి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. మేయర్ పదవికి తన పేరు ఖరారుకావడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు.