21 మంది విచారణ ఖైదీలకు కరోనా
ABN , First Publish Date - 2021-05-11T14:56:32+05:30 IST
ఒడిశా మయూర్భంజ్లోని ఉడల సబ్-జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మంది..
మయూర్భంజ్: ఒడిశా మయూర్భంజ్లోని ఉడల సబ్-జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వీరిని ఐసొలేషన్లో ఉంచినట్టు ఉడల ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ అధికారి విద్యాధర్ దండపత్ తెలిపారు. ఖైదీల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, వైద్య పరీక్షలు చేయగా 21 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారిని ఐసొలేషన్లో ఉంచామని చెప్పారు. సరైన వైద్యచికిత్స అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే, కోవిడ్ కేర్ సెంటర్కు పేషెంట్లను తరలిస్తామని వివరించారు. ఒడిస్సాలో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ చెబుతోంది. గత ఆదివారం కొత్తగా 17 మంది మృత్యువాత పడటంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 2,197కు చేరింది.