అసోంలో కొండచరియలు విరిగి 21 మంది మృతి
ABN , First Publish Date - 2020-06-03T08:15:27+05:30 IST
అసోంలోని బరాక్ లోయ పరిధిలోని హాయీలాకాందీ, సిల్చర్, కరీంగంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డా యి. దీంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి...
సిల్చర్, జూన్ 2: అసోంలోని బరాక్ లోయ పరిధిలోని హాయీలాకాందీ, సిల్చర్, కరీంగంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డా యి. దీంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రులకు తరలించిన సహాయక బృందాలు, పో లీసులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వివరించారు.