విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ 21మంది జాడేదీ?

ABN , First Publish Date - 2020-03-27T13:36:05+05:30 IST

ఇంకా 21మంది జాడ తెలియరాలేదు. ఇప్పటికే 181మంది

విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ 21మంది జాడేదీ?

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ :  మలక్‌పేట క్లస్టర్‌ పరిధిలోని శాలివాహననగర్‌, మాదన్నపేట, మలక్‌పేట, గడ్డిఅన్నారం, జాంబాగ్‌ పార్క్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో విదేశాల నుంచి వచ్చిన 203మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇంకా 21మంది జాడ తెలియరాలేదు. ఇప్పటికే 181మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


ఇందులో అమెరికా నుంచి వచ్చి మాదన్నపేట పూర్ణోదయకాలనీలో నివాసముంటున్న వ్యక్తికి జరిపిన వైద్యపరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినప్పటికీ బహిరంగంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన వైద్య బృందం పోలీసుల సహాయంతో వికారాబాద్‌లోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. అనంతరం దాదాపు 258మంది వైద్య సిబ్బంది పూర్ణోదయకాలనీలోని 3,785ఇళ్లలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2020-03-27T13:36:05+05:30 IST