200 బస్తాల రేషన్ బియ్యం సీజ్
ABN , First Publish Date - 2021-06-14T05:51:59+05:30 IST
రేషన్ బియ్యాన్ని అ క్రమంగా లారీలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, 200 బస్తాలు సీజ్ చేసినట్లు వేటపాలెం ఎస్సై కమలాకర్ తెలిపారు. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న వేటపాలెం పోలీసులు దేశాయిపేట జంక్షన్ వద్ద అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీ చేశా రు. అందులో 200 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
తిమ్మసముద్రంకు చెందిన వ్యక్తికి చెందినవిగా గుర్తింపు
వేటపాలెం(చీరాల), జూన్ 13 : రేషన్ బియ్యాన్ని అ క్రమంగా లారీలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, 200 బస్తాలు సీజ్ చేసినట్లు వేటపాలెం ఎస్సై కమలాకర్ తెలిపారు. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న వేటపాలెం పోలీసులు దేశాయిపేట జంక్షన్ వద్ద అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీ చేశా రు. అందులో 200 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారించగా ఆ రేషన్ బియ్యం నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన ఒ క వ్యక్తివని చెప్పాడు. అందుకు సంబంధించి పూర్తివివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. పట్టుబడ్డ లారీని వేటపాలెం పోలీ్సస్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.