బాలికపై యువకుడి లైంగికదాడి.. 20 ఏళ్ల జైలు..
ABN , First Publish Date - 2021-04-29T14:49:54+05:30 IST
ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడికి..
హైదరాబాద్ సిటీ : ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. భవానీనగర్ ప్రాంతంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటికి ఎదురుగా నివసించే ఎండీ యూసఫ్(24) ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ 4న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యూసఫ్ ఆమె కుమార్తె నోరు మూసి లైంగిక దాడి చేశాడు. అలికిడి విని లేచి చూసే సమయంలో తప్పించుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భవానీనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేసిన పోలీసులు.. 6 నెలల్లో చార్జ్షీట్ను కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి జస్టిస్ సునీత నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.