అత్తపై అత్యాచారానికి పాల్పడిన మేనల్లుడు.. అదే సమయంలో బయటి నుంచి మామ రావడంతో..

ABN , First Publish Date - 2022-04-06T18:32:49+05:30 IST

ఆ కుర్రాడు తరచుగా మేనమామ ఇంటికి వెళ్లేవాడు.. ఆ సమయంలో అతడి కన్ను మేనమామ భార్యపై పడింది..

అత్తపై అత్యాచారానికి పాల్పడిన మేనల్లుడు.. అదే సమయంలో బయటి నుంచి మామ రావడంతో..

ఆ కుర్రాడు తరచుగా మేనమామ ఇంటికి వెళ్లేవాడు.. ఆ సమయంలో అతడి కన్ను మేనమామ భార్యపై పడింది.. సోమవారం సాయంత్రం ఆ కుర్రాడు మామ లేని సమయంలో ఇంటికి వెళ్లాడు.. ఒంటరిగా ఉన్న అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆమె ప్రతిఘటించడంతో ఇనుప రాడ్డుతో తలపై కొట్టాడు.. అదే సమయంలో మామ రావడంతో గోడ దూకి పారిపోయాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. 


రాజస్థాన్‌లోని శ్రీగంగాపూర్ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెతో శారీరక సుఖం పొందాలనుకున్నాడు. మామ ఇంట్లో లేని సమయం కోసం వేచి చూశాడు. సోమవారం సాయంత్రం మామ బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా అత్తను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుప రాడ్డుతో తలపై కొట్టాడు. 


నీరసంగా కింద పడిపోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ కుర్రాడి మేనమామ బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న కుర్రాడు గోడ దూకి పారిపోయాడు. భార్య నుంచి విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి మేనల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-06T18:32:49+05:30 IST