రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు:హరీశ్‌

ABN , First Publish Date - 2022-01-25T07:39:35+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం

రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు:హరీశ్‌

రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో రూ.2.40 కోట్ల ఖర్చుతో వీటిని నెలకొల్పనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 57 బ్లడ్‌ బ్యాంకులు, 51 బ్లడ్‌ స్టోరేజీ సెంటర్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కరోనా పరిస్థితులు, జ్వర సర్వే, వ్యాక్సినేషన్‌ అంశాలపై సోమవారం వైద్య ఆరోగ్య అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.


రాష్ట్రంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటును కొనసాగిస్తూనే.. ఆస్పత్రుల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా లేబర్‌ రూములు, డ్రైనేజీలు, విద్యుత్‌ సరఫరాతోపాటు అన్ని రకాల మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం.10.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.


Updated Date - 2022-01-25T07:39:35+05:30 IST