20 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-03-07T06:41:50+05:30 IST
20 మందికి కరోనా పాజిటివ్
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు జిల్లాలో పాజిటివ్ కేసులు పదిలోపు మాత్రమే నమోదు కాగా, శనివారం కొత్తగా 20 మందికి కరోనా సోకింది. ఈ కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,991కు పెరిగింది. కరోనా బారినపడిన బాధితుల్లో ఇప్పటి వరకు 48,195 మంది కోలుకుని ఇళ్లకు చేరుకు న్నారు. ఇంకా 115 మంది చికిత్స పొందుతున్నారు.