రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తున్న రెండేళ్ల పాప.. ఎంతకూ ఆపకపోవడంతో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-12-21T00:19:59+05:30 IST

తల్లిదండ్రుల దగ్గర హాయిగా నిద్రించాల్సిన రెండేళ్ల పాప రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తుంది. ఆ ధ్వని చుట్టుపక్కల

రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తున్న రెండేళ్ల పాప.. ఎంతకూ ఆపకపోవడంతో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..

లక్నో: తల్లిదండ్రుల దగ్గర హాయిగా నిద్రించాల్సిన రెండేళ్ల పాప రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తుంది. ఆ ధ్వని చుట్టుపక్కల వారందరికీ స్పష్టంగా వినిపిస్తోంది. పాప ఏడుపు ఎంతకూ ఆపకపోవడం చాలాసేపు గమనించిన తర్వాత పక్కింటి వాళ్లు అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. అపుడు కనిపించిన సీన్ చూసి వారు షాకయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


ప్రతాప్పూర్ గ్రామానికి చెందిన అమిత్‌కు పూజతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లైన కొద్దిరోజుల నుంచే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పూజ తరచూ పుట్టింటికి వెళ్తూ వచ్చేది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం పూజ పుట్టింటి నుంచి తిరిగి అత్తారింటికి వచ్చింది. అయితే ఈసారి పూజ అత్తతో గొడవపడుతూ కనిపించింది. అపుడు అమిత్ భార్యను గొడవ పడవద్దని చెప్పి హెచ్చరించాడు. భర్త మాటకు కోపంతో పాపని తీసుకుని పూజ పుట్టింటికి బయల్దేరింది. 


అది గమనించిన అమిత్ పూజ కొంచెం దూరం వెళ్లగానే ఆగ్రహంతో అక్కడకు చేరుకుని కత్తితో ఆమెని పొడిచి చంపేశాడు. రక్తపుమడుగులో పడిపోయిన పూజను, ఏడుస్తూ తల్లి దగ్తర ఉన్న పాపను అక్కడే వదిలి అమిత్ కుటుంబసభ్యులతో సహా పారిపోయాడు. రోడ్డు మీద తల్లి మ‌ృతదేహం వద్ద పాప గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. పాప ఏడుపు ఎంతకూ ఆపకపోవడంతో స్థానికులు బయటకు రాగా.. అక్కడ దృశ్యం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-12-21T00:19:59+05:30 IST