శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల మృతి

ABN , First Publish Date - 2022-04-10T21:30:16+05:30 IST

శ్రీనగర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. మృతులను పాకిస్తాన్‌లోని నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబాకు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల మృతి

శ్రీనగర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. మృతులను పాకిస్తాన్‌లోని నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబాకు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు. కాశ్మీర్‌లోని సిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. దీంతో తీవ్రవాదులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రవాదులు మరణించారు. వీరి నుంచి కొన్నిఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడులు జరిపిన ఘటనలో తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-04-10T21:30:16+05:30 IST