రెండు విమానాలు ఢీకొని ఇద్దరు మృతి.. ఆరుగురు గల్లంతు!

ABN , First Publish Date - 2020-07-06T20:25:16+05:30 IST

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు ఢీకొని ఇద్దరు మరణించగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇ

రెండు విమానాలు ఢీకొని ఇద్దరు మృతి.. ఆరుగురు గల్లంతు!

వాషింగ్టన్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు ఢీకొని ఇద్దరు మరణించగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీకొని, కోయర్ డీఅలెన్ సరస్సులో పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా.. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఎనిమిది మంది ప్రయాణికుల్లో ఇద్దరు మరణించినట్లు స్పషం చేశారు. వారి మృతదేహాలను సరస్సు నుంచి వెలికితీసినట్లు తెలిపిన పోలీసులు.. మరో ఆరుగురు గల్లంతైనట్లు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2020-07-06T20:25:16+05:30 IST