కుప్వారాలో హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల కాల్చివేత

ABN , First Publish Date - 2022-06-20T00:13:37+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారంనాడు జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను...

కుప్వారాలో హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల కాల్చివేత

కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారంనాడు జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా (Laskar-e-taiba) ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా డీహెచ్ పోర ప్రాంతంలో మరో ఆపరేషన్ జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. నార్త్ కశ్మీర్‌లోని లోలబ్ ప్రాంతంలో గాలింపు చర్యల అనంతరం కుప్వారాలో జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు.


కాగా, ఎన్‌కౌంటర్‌లో హతమైన ఒక టెర్రరిస్టును లష్కరేతో సంబంధం ఉన్న పాక్ ఉగ్రవాదిగా గుర్తించామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IGP) విజయ్ కుమార్ తెలిపారు. మరో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు తమ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు చెప్పారు. కాగా, కుల్గాంలోని దమ్హాల్ హంజి పోర ఏరియాలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని, ప్రస్తుతం హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


Updated Date - 2022-06-20T00:13:37+05:30 IST