2 లక్షల మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేశాం: ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-01-14T23:25:47+05:30 IST
2 లక్షల మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేశాం: ప్రభుత్వం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 2 లక్షల మంది పిల్లలకు ఒకే వ్యాక్సినేషన్ వేసినట్లు అధికారులు చెప్పారు. జనవరి 12 వరకు పుణె జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 2,12,735 మంది లబ్ధిదారులు తమ మొదటి డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ని పొందారని అధికారులు తెలిపారు. ఇందులో 15-18 ఏళ్ల మధ్య 5.53 లక్షల మంది ఉన్నారని, పూణె నగరంలో సుమారు 52,000 మంది టీనేజర్లకు కోవిడ్-19 టీకాలు వేసినట్లు ఒక అధికారి తెలిపారు.