జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకలకలం.. ఇద్దరు జవాన్లు సహా ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-06-13T00:03:01+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకలకలం.. ఇద్దరు జవాన్లు సహా ఐదుగురి మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్త బృందంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు తొలుత గ్రనేడ్లు విసిరి ఆపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. కాగా, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయి వారికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.

Updated Date - 2021-06-13T00:03:01+05:30 IST