బాలికను గర్భవతిని చేసిన ప్రియుడు.. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో..
ABN , First Publish Date - 2021-03-07T22:14:58+05:30 IST
గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, ఆపై పూడ్చిపెట్టిన కేసులో ఇద్దరు యువకులను
మేదినినగర్ (ఝార్ఖండ్): గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, ఆపై పూడ్చిపెట్టిన కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్లోని పాలేము జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలి 18 ఏళ్ల బాయ్ఫ్రెండ్, అతడి స్నేహితుడిని హుస్సేన్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియాడి గ్రామంలో శనివారం అరెస్ట్ చేశారు. ఎస్పీ సంజీవ్ కుమార్ కథనం ప్రకారం.. ప్రియుడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. అబార్షన్ కోసం ఓ నర్స్ రూ. 10 వేలు అడిగితే సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో ఆమెను చంపడమే సమస్యకు పరిష్కారమని భావించాడు. గత నెల 21న బాలికను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపై పొడిచి చంపేశాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ఆమె మృతదేహాన్ని సోనే నది ఒడ్డుకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ కేసులో నిన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.