తల్లిదండ్రులతో సహా నలుగురిని చంపి.. బతికుండగానే పాతేశాడు.. 19 ఏళ్ల కుర్రాడి దారుణమిది..!

ABN , First Publish Date - 2021-06-20T01:05:26+05:30 IST

తల్లిదండ్రులతో వచ్చిన మనస్పర్థలు ఆ కుర్రాడిలో క్రూరత్వాన్ని తట్టిలేపాయి..

తల్లిదండ్రులతో సహా నలుగురిని చంపి.. బతికుండగానే పాతేశాడు.. 19 ఏళ్ల కుర్రాడి దారుణమిది..!

తల్లిదండ్రులతో వచ్చిన మనస్పర్థలు ఆ కుర్రాడిలో క్రూరత్వాన్ని తట్టిలేపాయి.. తల్లికి, తండ్రికి, సోదరికి, బామ్మకు విషం కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.. అనంతరం వారు బతికుండగానే ఇంటి కింద పాతేశాడు.. ఈ కిరాతక ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కలియాచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 


కలియాచాక్‌కు చెందిన అసిఫ్ (19) ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్స్‌తోనే కాలం గడిపేవాడు. స్వయంగా ఓ అప్లికేషన్ తయారు చేయాలనుకున్నాడు. అయితే ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో గొడవపడి వారిని కడతేర్చాడు. తల్లిదండ్రులకు, సోదరికి, బామ్మకు విషం కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. ఇంట్లో వేర్ హౌస్ కింద గొయ్యి తీసి పాతేశాడు. మరో సోదరుడు ఆరిఫ్‌ను మాత్రం వదిలేశాడు. ఎవరికైనా చెబితే నీకు ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. ఆ ఇంట్లోనే నాలుగు నెలలు ఉన్నాడు.  


తన కుటుంబ సభ్యులు ఊరుకెళ్లారని ఇరుగుపొరుగు వారికి చెప్పేవాడు. ఆన్‌లైన్ యాప్ ద్వారా ఆహారం తెచ్చుకునే వాడు. అయితే నాలుగు నెలల తర్వాత ఆరిఫ్ కలియాచాక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అసిఫ్‌ను అరెస్ట్ చేశారు. తానే హంతకుడినని పోలీసుల ఎదుట అసిఫ్ అంగీకరించాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్నందు వల్లే అసిఫ్ ఇంత కిరాతకంగా వ్యవహరించి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-06-20T01:05:26+05:30 IST