ఏపీకి 199 కోట్లు..
ABN , First Publish Date - 2020-09-19T08:56:19+05:30 IST
జాతీయ ఆరోగ్య మిషన్ కింద కరోనా కట్టడి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీగా ఆంధ్రప్రదేశ్కు రూ.199.87కోట్లు, తెలంగాణకు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ కింద కరోనా కట్టడి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీగా ఆంధ్రప్రదేశ్కు రూ.199.87కోట్లు, తెలంగాణకు రూ. 256.89 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో 10లక్షల జనాభాకు 426 టెస్టులే
తెలంగాణలో కరోనా టెస్టులు జాతీయ సగటు కంటే తక్కువ జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినికుమార్ వెల్లడించారు. సెప్టెంబరు 9నుంచి 15వరకు లెక్కల ప్రకారం టెస్టుల విషయంలో జాతీయ సగటు 10 లక్షల జనాభాలో రోజుకు 683 ఉండగా.. తెలంగాణలో 10 లక్షల జనాభాలో రోజుకు 426 మాత్రమే చేశారన్నారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో వివిధపార్టీల ఎంపీలు అడిగి న ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.