కర్ణాటకలో కొత్తగా 196 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-24T01:32:46+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి.

కర్ణాటకలో కొత్తగా 196 కరోనా కేసులు

బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కరోనా కేసుల సంఖ్య ఇదే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,939కి చేరింది. ఇదే సమయంలో మొత్తమ్మీద 598మంది కరోనా బాధితులు కోలుకోగా, 42 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు.

Updated Date - 2020-05-24T01:32:46+05:30 IST