తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-13T15:16:17+05:30 IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో..

తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 86,475 కరోనా కేసులు ఉండగా.. 665 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,736 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 63,074 మంది డిశ్చార్జ్ అయ్యారు.


ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 6,89,150 కరోనా టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 298 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ 144, రంగారెడ్డి 124, కరీంనగర్‌ 89, సంగారెడ్డి 86, నల్గొండ 84, ఖమ్మం 73, మేడ్చల్‌ 71, సూర్యాపేట జిల్లాలో 64 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2020-08-13T15:16:17+05:30 IST