19 రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-12T23:06:55+05:30 IST

19 రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు

19 రాష్ట్రాల్లో  పెరిగిన కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: భారతదేశంలో రోజురోజుకూ కొత్త కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల్లో 10,000 కంటే ఎక్కువ యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2,25,199 యాక్టివ్ కోవిడ్-19 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 1,02,236 కేసులు, తమిళనాడులో 75,083 కేసులు, ఢిల్లీలో 74,881 కేసులు, కర్ణాటకలో 73,289 కోవిడ్ కేసులు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో 5,000-10,000 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2022-01-12T23:06:55+05:30 IST