శ్రీలంక సంక్షోభం.. బోటులో భారత్ చేరుకున్న 19 మంది శ్రీలంక తమిళులు

ABN , First Publish Date - 2022-04-11T02:20:13+05:30 IST

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో జాఫ్నా, మన్నార్‌కు చెందిన

శ్రీలంక సంక్షోభం.. బోటులో భారత్ చేరుకున్న 19 మంది శ్రీలంక తమిళులు

చెన్నై: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో  జాఫ్నా, మన్నార్‌కు చెందిన 19 మంది శ్రీలంక తమిళులు బోటు ద్వారా తమిళనాడులోని ధనుస్కోడి తీరానికి చేరుకున్నారు. ఇప్పుడు వీరందరూ భారత్ ఆశ్రయం కోరుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా మారడంతో అక్కడ జీవించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత ఎత్తలో ఉన్నాయని వారు వాపోయారు. 


శుక్రవారం కూడా ఓ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి భారత తీరానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 39 మంది భారత్ చేరుకున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకోవడంతో చాలామంది భారత ఆశ్రయం కోరుతూ భారత్ చేరుకుంటున్నారు. 

Updated Date - 2022-04-11T02:20:13+05:30 IST