పాకిస్థాన్‌లో హోర ప్రమాదం.. 19 మంది మృతి!

ABN , First Publish Date - 2020-07-03T22:56:05+05:30 IST

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది అక్కడిక్కడే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు 27 మంది ప్రయాణికులు

పాకిస్థాన్‌లో హోర ప్రమాదం.. 19 మంది మృతి!

లాహోర్: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది అక్కడిక్కడే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు 27 మంది ప్రయాణికులు ఉన్న మినీ బస్సు.. ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది సిక్కు యాత్రికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆసుపత్రికి తరలించిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 


Updated Date - 2020-07-03T22:56:05+05:30 IST