19న కర్షక, కార్మిక మహాపంచాయత్
ABN , First Publish Date - 2021-04-11T05:16:43+05:30 IST
భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ ముఖ్యఅతిథిగా ఈ నెల 19న ఒంగోలులో తలపెట్టిన మహాపంచాయత్కు సన్నాహక సమావేశం స్థానిక మల్లయ్య లింగం భవన్లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు.
ఒంగోలు(జడ్పీ), ఏప్రిల్ 10: భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ ముఖ్యఅతిథిగా ఈ నెల 19న ఒంగోలులో తలపెట్టిన మహాపంచాయత్కు సన్నాహక సమావేశం స్థానిక మల్లయ్య లింగం భవన్లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. మహాపంచాయత్ను జయప్రదం చేసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న నాయకులకు ప్రకాశం జిల్లా తరపున సం ఘీభావం గట్టిగా తెలపాలని నాయకులు తీర్మానించారు. అలాగే ఏఐకెఎస్ సీసీ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధవాతే, ఏఐపీఎఫ్ పాట్రాన్ పోషకులు కె. అశోక్రావుతో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను మహాపంచాయత్ ద్వారా జిల్లా ప్రజల కు వివరించి చైతన్య పరచడమే ప్రధాన ఉద్దేశ్యమని వారు చెప్పారు. స మావేశంలో ఆచార్యరంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శే షయ్య, రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల హనుమంతు రావు, వడ్డే హనుమారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లంరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.