19 ఐపీఓలు.. రూ.13,410 కోట్లు
ABN , First Publish Date - 2021-01-25T07:52:40+05:30 IST
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్ క్రమంగా గాడిన పడుతోంది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 19 కంపెనీలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్ క్రమంగా గాడిన పడుతోంది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 19 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చా యి. ఈ ఇష్యూల ద్వారా ఈ కంపెనీలు మార్కెట్ నుంచి మొత్తం ఏకంగా 186 కోట్ల డాలర్లు (సుమారు రూ.13,410 కోట్లు) సేకరించాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రగా పని చేసే గ్లాండ్ ఫార్మా అత్యధికంగా 86.9 కోట్ల డాలర్లు సమీకరించింది. డిసెంబరు త్రైమాసికంలో 10 పెద్ద కంపెనీలు, తొమ్మిది ఎస్ఎంఈలు.. పబ్లిక్ ఇష్యూకు వచ్చిన వాటిల్లో ఉన్నాయి.