కోమరోస్ టూ ఇండియా వయా టాంజేనియా

ABN , First Publish Date - 2020-08-10T05:07:07+05:30 IST

కోమరోస్‌లో చిక్కుకున్న 19 మంది భారతీయులు కొద్ది గంటల క్రితం ప్రత్యేక విమానంలో

కోమరోస్ టూ ఇండియా వయా టాంజేనియా

మొరోని: కోమరోస్‌లో చిక్కుకున్న 19 మంది భారతీయులు కొద్ది గంటల క్రితం ప్రత్యేక విమానంలో టాంజేనియాకు బయల్దేరారు. టాంజేనియాలో చిక్కుకున్న మరికొంత మంది భారతీయులతో కలిసి వీరంతా సోమవారం భారత్‌కు రానున్నారు. కరోనా నేపథ్యంలో భారతీయులు కోమరోస్‌లో చిక్కుకుపోయారని.. కోమరోస్ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే నేడు వీరంతా ఇండియాకు వెళ్లగలుగుతున్నారని అక్కడి ఇండియన్ అంబాసడర్ అభయ్ కుమార్ తెలిపారు. భారతీయులంతా జాగ్రత్తగా స్వదేశానికి చేరుకోవాలని కోరుకుంటున్నామని మడగాస్కర్, కోమరోస్‌లోని ఇండియన్ ఎంబసీలు ట్విటర్ ద్వారా తెలిపాయి. కాగా.. జూన్‌లో మడగాస్కర్‌లో చిక్కుకున్న 85 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. కోమరోస్ దేశం భారత మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉంటుంది. 2019 అక్టోబర్‌లో రక్షణ ఒప్పందం చేసుకునేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోమరోస్ పర్యటనకు వెళ్లారు. ఉన్నత పదవిలో ఉండి ఈ దేశ పర్యటనకు వెళ్లిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు అనే చెప్పాలి.

Updated Date - 2020-08-10T05:07:07+05:30 IST