Pakistan: లోయలో పడిన బస్సు.. 19 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2022-07-04T02:26:09+05:30 IST
పాకిస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్
కరాచీ: పాకిస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ (Islamabad) నుంచి 30 మంది ప్రయాణికులతో క్వెట్టా (Quetta) వెళ్తున్న బస్సు మరికాసేపట్లో గమ్యానికి చేరుకుంటుందనగా జోబ్ సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, వర్షమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ (Shehbaz Sharif), బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ (Mir Abdul Quddus Bizenjo) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.