188 కోట్ల టీకా డోసులు అవసరం: కేంద్రం

ABN , First Publish Date - 2021-07-21T05:10:55+05:30 IST

దేశంలోని 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలంటే దాదాపు 188 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని కేంద్రం తాజాగా తెలిపింది.

188 కోట్ల టీకా డోసులు అవసరం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలంటే దాదాపు 188 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని కేంద్రం తాజాగా తెలిపింది. అయితే..ప్రస్తుతమున్న రెండు డోసుల టీకాలకు తోడు ఒకే డోసులో ఇచ్చే టీకాలు కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డోసుల సంఖ్య తగ్గుతాయని కేంద్రం చెప్పింది. ఈ ఏడాదిలో దాదాపు 187 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇక ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ దాదాపు 41 టీకా డోసులు ప్రజలకు అందాయి.  

Updated Date - 2021-07-21T05:10:55+05:30 IST