పోలీసు కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.80 లక్షల ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-12-07T05:36:19+05:30 IST

పోరుమామిళ్ల పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తూ ఈ ఏడాది మార్చి నెలలో అనారోగ్యంతో మృతిచెందిన గడికోట శివయ్య కుటుంబానికి పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లోని పోలీసులు రూ.1.80 లక్షల ఆర్థికసాయం అందజేశారు. సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్‌, బీకోడూరు ఎస్‌ఐ నస్రీన్‌ చేతుల మీదుగా శివయ్య కుమార్తె చందన , కుమారుడు చంద్రశేఖర్‌, ఆయన సతీమణికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్‌ను అందించారు.

పోలీసు కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.80 లక్షల ఆర్థికసాయం
కానిస్టేబుల్‌ శివయ్య కుటుంబ సభ్యులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలను అందజేస్తున్న సీఐ, ఎస్‌ఐలు

పోరుమామిళ్ల, డిసెంబరు 6: పోరుమామిళ్ల పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తూ ఈ ఏడాది మార్చి నెలలో అనారోగ్యంతో మృతిచెందిన గడికోట శివయ్య కుటుంబానికి పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లోని పోలీసులు రూ.1.80 లక్షల ఆర్థికసాయం అందజేశారు. సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్‌, బీకోడూరు ఎస్‌ఐ నస్రీన్‌ చేతుల మీదుగా శివయ్య కుమార్తె చందన , కుమారుడు చంద్రశేఖర్‌, ఆయన సతీమణికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్‌ను అందించారు. సోమవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో గడికోట శివయ్య సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడప రిమ్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏఎ్‌సఐగా పనిచేస్తున్న రాయల్‌ యోగయ్య మాట్లాడుతూ శివయ్య కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తన పోలీసు మిత్రులతో చర్చించి ఈ మొత్తాన్ని సేకరించామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ నాగేంద్ర, హెడ్‌కానిస్టేబుల్‌ మల్లిఖార్జు, ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:36:19+05:30 IST