Fishing trawler: సముద్రంలో మునిగిన పడవ.. 18 మంది మత్స్యకారుల గల్లంతు
ABN , First Publish Date - 2022-08-20T01:58:45+05:30 IST
బంగాళాఖాతంలో ఓ గుర్తు తెలియని వస్తువును ఢీకొన్న చేపలబోటు మునిగిన ఘటనలో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు
కోల్కతా: బంగాళాఖాతంలో ఓ గుర్తు తెలియని వస్తువును ఢీకొన్న చేపలబోటు మునిగిన ఘటనలో 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. పశ్చిమ బెంగాల్ (west bengal) దక్షిణ 24 పరగాణాస్లోని కక్ద్వీప్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు.
సముద్రంలో ట్రాలర్ (Trawler) మునిగిపోయిన సమయంలో అందులో 18 మంది ఉన్నట్టు స్థానిక జాలర్లు చెబుతున్నారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నా ఇప్పటి వరకు వారి జాడ కనిపించలేదని అధికారులు తెలిపారు. బాధితులందరూ సుందర్బన్స్ ప్రాంతానికి చెందినవారు. వీరందరూ ఎంవీ సత్యనారాయణ అనే ట్రాలర్పై చేపలవేటకు వెళ్లారు. కెండో ఐలాండ్ సమీపంలో వీరి బోటు సముద్రంలో ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొని మునిగిపోయినట్టు చెబుతున్నారు.