18 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-08-12T05:51:42+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వేగంగా పాకుతోంది. కేసులు సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
అనంతపురం టౌన, ఆగస్టు11: జిల్లాలో కరోనా వైరస్ వేగంగా పాకుతోంది. కేసులు సంఖ్య పెరుగుతూనే వస్తోంది. గురువారం గడిచిన 24 గంటల్లో మొత్తం 60 శాంపిల్స్ పరీక్షలు చేయగా ఇందులో 18 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు ఇంచార్జ్ డీఎంహెచఓ డాక్టర్ యుగంధర్ తెలిపారు. అయితే 14 మంది ఆరోగ్యంగా కోలుకోగా ప్రస్తుతం 58 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.