అర్ధరాత్రి టాయ్‌లెట్‌ కోసం బయటకు వెళ్లిన యువతి.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..

ABN , First Publish Date - 2022-02-17T17:56:51+05:30 IST

అర్ధరాత్రి సమయంలో ఆ యువతి లేచి బయటకు వెళ్తోంది.. అదే సమయంలో తల్లికి మెలకువ రావడంతో ఎక్కడికని అడిగింది..

అర్ధరాత్రి టాయ్‌లెట్‌ కోసం బయటకు వెళ్లిన యువతి.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..

అర్ధరాత్రి సమయంలో ఆ యువతి లేచి బయటకు వెళ్తోంది.. అదే సమయంలో తల్లికి మెలకువ రావడంతో ఎక్కడికని అడిగింది.. టాయ్‌లెట్‌కు వెళ్తున్నానని చెప్పి ఆ యువతి బయటకు వెళ్లింది.. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆ తల్లికి అనుమానం వచ్చి భర్తకు చెప్పి ఇల్లంతా వెతికింది.. ఎక్కడా ఆ యువతి జాడ లేదు.. ఊరంతా గాలించినా ఆమె కనిపించలేదు.. చివరకు వారు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పారు. 


రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన 17 ఏళ్ల యువతి మంగళవారం రాత్రి టాయ్‌లెట్‌కని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అర్ధరాత్రి సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు ఇల్లంతా గాలించారు. తర్వాతి రోజు ఊరిలో కూడా వెతికారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో బంగారం, రూ.20 వేలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 


తమ కూతురు కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉందని, అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఇంకా మైనర్ అని, ఆమెను తీసుకెళ్లిన వారిపై కిడ్నాప్ కేసు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-02-17T17:56:51+05:30 IST