17వసారి తిరుమలకు పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-28T02:45:27+05:30 IST

తిరుమలకు 17వసారి పాదయాత్రగా బయలుదేరిన యువకుల బృందాన్ని సీఐ రవి నాయక్‌, నాయకులు కర్నాటి రవీం

17వసారి తిరుమలకు పాదయాత్ర
పాదయాత్ర బృందాన్ని జెండా ఊపి సాగనంపుతున్న సీఐ రవినాయక్‌

సంగం, సెప్టెంబరు 27: తిరుమలకు 17వసారి పాదయాత్రగా బయలుదేరిన యువకుల బృందాన్ని సీఐ రవి నాయక్‌, నాయకులు కర్నాటి రవీంద్రరెడ్డి జెండా ఊపి మంగళవారం సాగనంపారు. సంగంతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు వర్షాలు బాగా కురిసి, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తలచి మాగం గిరిబాబు ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సుమారు 40 మంది యువకులు  తిరుమలకు బయలుదేరారు. వీరు పొదలకూరు, రాపూరు, డక్కిలి, రేణిగుంటల మీదుగా  తిరుమలకు చేరుకుంటారు.


----------------


Updated Date - 2022-09-28T02:45:27+05:30 IST