177 జవాబులు రాస్తే 6 రాసినట్టు చూపారు
ABN , First Publish Date - 2021-10-23T08:13:24+05:30 IST
నీట్ పరీక్ష వల్ల తాను తీవ్రంగా నష్టపోయానంటూ తమిళనాడుకు చెందిన అభ్యర్థి ఏకంగా..
ప్రధాని మోదీకి నీట్ అభ్యర్థి ఫిర్యాదు
చెన్నై, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష వల్ల తాను తీవ్రంగా నష్టపోయానంటూ తమిళనాడుకు చెందిన అభ్యర్థి ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం తీవ్ర సంచలనం రేపింది. గత నెలలో జరిగిన నీట్ పరీక్షలో 177 ప్రశ్నలకు జవాబులు రాయగా, ఇటీవల వెలువడిన ఓఎంఆర్ షీట్లో తాను కేవలం 6 జవాబులు మాత్రమే రాసినట్లు పేర్కొన్నారంటూ కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్కు చెందిన ఆయుష్ అనే అభ్యర్థి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాడు. రూ.35 వేలు చెల్లించి రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని, తనకు న్యాయం చేయాలని ప్రధానిని కోరాడు.