కశ్మీర్‌లో 16.79 లక్షల నివాస ధ్రువీకరణ పత్రాలు: కేంద్రం

ABN , First Publish Date - 2020-09-21T00:14:36+05:30 IST

1947 నాటి ఇండో-పాక్ యుద్ధం కారణంగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పిఒజెకె)లో మొత్తం 31,619 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, అందులో 26,319 కుటుంబాలు

కశ్మీర్‌లో 16.79 లక్షల నివాస ధ్రువీకరణ పత్రాలు: కేంద్రం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 21,13,879 మంది నివాస ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 16,79,520 మందికి నివాస ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో అడిగిన ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు లోక్‌సభలో ఆయన సమాధానం ఇచ్చారు. కాగా 1,21,630 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని ఆయన అన్నారు.


1947 నాటి ఇండో-పాక్ యుద్ధం కారణంగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పిఒజెకె)లో మొత్తం 31,619 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందులో 26,319 కుటుంబాలు ప్రస్తుత ధ్రువీకరణలో నమోదు అయ్యాయని, వారంతా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో స్థిరపడ్డారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో రిజిస్టర్ అయిన మొత్తం 5,300 కుటుంబాలు తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-21T00:14:36+05:30 IST