యమునోత్రి భక్తుల బస్సు బోల్తా.. 17 మంది మృతి
ABN , First Publish Date - 2022-06-06T02:21:53+05:30 IST
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 17 మంది మరణించారు. యమునోత్రికి భక్తులతో వెళ్తోన్న బస్సు ఆదివారం డంటా ప్రాంతంలో ఒక లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారంతా మధ్యప్రదేశ్కు చెందినవారని..
డెహ్రడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 17 మంది మరణించగా, మరో 28 మంది లోయలో పడిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. యమునోత్రికి భక్తులతో వెళ్తోన్న బస్సు ఆదివారం డంటా ప్రాంతంలో ఒక లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారంతా మధ్యప్రదేశ్కు చెందినవారని సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు దిగినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి మాట్లాడానని అమిత్ షా ట్వీట్ చేశారు.