17 జిల్లాల్లో పదిలోపు Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-23T17:57:50+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 767మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో
- మూడు జిల్లాల్లో నిల్
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 767మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరులో 552మందికి, కొప్పళ, రాయచూరు, యాదగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇతర జిల్లాల్లో 10-30మధ్యన నమోదయ్యాయి. 1,692మంది డిశ్చార్జ్ కాగా 29మంది మృతి చెందారు. బెంగళూరులో 14మంది, దక్షిణకన్నడలో ముగ్గురు, మూడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 10,406మంది చికిత్స పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 5,255 మంది ఉన్నారు.