కర్ణాటకలో కరోనా కల్లోలం
ABN , First Publish Date - 2020-07-04T03:27:11+05:30 IST
కర్ణాటకలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా కర్ణాటకలో 1,694 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19710కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 10608.
కర్ణాటకలో శుక్రవారం 21 మంది కరోనా వల్ల మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో.. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 293కి చేరింది. ఇప్పటివరకూ కర్ణాటకలో 8805 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ ఒక్కరోజే.. 471 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. 201 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.